‘ఫిష్ ఆంధ్రా’తో ఉపాధి
ABN , First Publish Date - 2023-02-01T23:33:47+05:30 IST
మండలంలోని గురండిలో ఫిష్ఆంధ్రా యూనిట్ స్థలాన్ని పార్వతీపురం మన్యం జిల్లా మత్స్యశాఖాధికారి తిరుపతయ్య బుధవారం పరిశీలించారు.
భామిని: మండలంలోని గురండిలో ఫిష్ఆంధ్రా యూనిట్ స్థలాన్ని పార్వతీపురం మన్యం జిల్లా మత్స్యశాఖాధికారి తిరుపతయ్య బుధవారం పరిశీలించారు. ఈసందర్భం గా ఆయన మాట్లాడుతూ ఫిష్ఆంధ్రా యూనిట్ వల్ల తాజా చేపలు అందుబాటులోకి రావడంతోపాటు లబ్ధిదారులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. యూనిట్ విలువ రూ.10 లక్షలు కాగా, లబ్ధిదారుడు ఎస్.రాజకుమార్ మంజూరు చేశామన్నారు. లబ్ధిదా రుడి వాటా కింద 20 శాతం నగదు చెల్లిస్తే ప్రభుత్వం భవన నిర్మాణానికి రూ.3 లక్షలు, పరికరాల కోసం రూ.7 లక్షలు విలువైన సామాగ్రి అందజేస్తుందని తెలిపారు. ఆయనతో పాటు పాలకొండ ఎఫ్డీవో గోపీకృష్ణ, మత్స్యశాఖ అసిస్టెంట్లు ఆదినారా యణ, ఎస్.శోభన్బాబు ఉన్నారు.