నిప్పంటుకుని వృద్ధురాలికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2023-02-06T23:51:15+05:30 IST

ప్రమాదవశాత్తు నిప్పంటుకున్న ఘటనలో ఓ వృద్ధురాలికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లా ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చలితీవ్రత కారణంగా సోమవారం మక్కువ మండల కోన గ్రామానికి చెందిన వెంకటమ్మ(55) మంచం కింద నిప్పుల కుంపటి పెట్టుకొని నిద్రపోయింది.

నిప్పంటుకుని వృద్ధురాలికి తీవ్రగాయాలు

పార్వతీపురం టౌన్‌: ప్రమాదవశాత్తు నిప్పంటుకున్న ఘటనలో ఓ వృద్ధురాలికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లా ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చలితీవ్రత కారణంగా సోమవారం మక్కువ మండల కోన గ్రామానికి చెందిన వెంకటమ్మ(55) మంచం కింద నిప్పుల కుంపటి పెట్టుకొని నిద్రపోయింది. ఈ క్రమంలో ఆమె చీరకు ఇప్పు అంటుకోవడంతో ఒక్క సారి మంటలు చెలరేగాయి. ఆమె భర్త పెంటన్న దొర మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వెంకటమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్సను అందిస్తున్నారు. ఔట్‌ పోస్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-02-06T23:51:17+05:30 IST