డ్రోన్‌ పైలెట్ల శిక్షణకు డీజీసీఏ అనుమతి

ABN , First Publish Date - 2023-03-26T00:16:07+05:30 IST

సెంచూరియన్‌ విశ్వవిద్యాలయంలో డ్రోన్‌ పైలెట్లకు రిమోట్‌ పైలెట్‌ ట్రైనింగ్‌ ఆపరేషన్‌ (ఆర్‌పీటీవో)లో శిక్షణ ఇచ్చేందుకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నుంచి అనుమతులు మంజూరు అయినట్లు యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ జీఎస్‌ఎన్‌ రాజు తెలిపారు.

డ్రోన్‌ పైలెట్ల శిక్షణకు డీజీసీఏ అనుమతి

నెల్లిమర్ల: సెంచూరియన్‌ విశ్వవిద్యాలయంలో డ్రోన్‌ పైలెట్లకు రిమోట్‌ పైలెట్‌ ట్రైనింగ్‌ ఆపరేషన్‌ (ఆర్‌పీటీవో)లో శిక్షణ ఇచ్చేందుకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నుంచి అనుమతులు మంజూరు అయినట్లు యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ జీఎస్‌ఎన్‌ రాజు తెలిపారు. తన చాంబర్‌లో ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడారు. డ్రోన్ల తయారీతో పాటు పైలెట్లకు శిక్షణ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలిపారు. సెంచూరియన్‌ యూనివర్శిటీ విజయనగరం, పర్లాఖిమిడి క్యాంపస్‌లలో వెయ్యి మంది పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మరో పక్క వ్యవసాయ రంగానికి ఉపయోగపడే కృషక్‌ డ్రోన్‌ తయారు చేసేందుకు కూడా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇందుకు 16లీటర్ల సామర్థ్యంగల కృషక్‌ డ్రోన్లను తయారుచేయడం వల్ల రైతులకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వివరించారు. డ్రోన్ల మరమ్మతుల కోసం హంగర్‌ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

Updated Date - 2023-03-26T00:16:07+05:30 IST