పశువుల కంటైనర్‌ పట్టివేత

ABN , First Publish Date - 2023-03-26T00:12:44+05:30 IST

అక్రమంగా పశువులను తరలిస్తున్న కంటైనర్‌ను పట్టుకున్నా మని పెదమానాపురం పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కాశీ తెలిపారు.

పశువుల కంటైనర్‌ పట్టివేత

దత్తిరాజేరు: అక్రమంగా పశువులను తరలిస్తున్న కంటైనర్‌ను పట్టుకున్నా మని పెదమానాపురం పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కాశీ తెలిపారు. శనివారం సాయంత్రం పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై వాహన తనిఖీ లు నిర్వహిస్తుండగా, అటుగా వస్తున్న కంటైనర్‌ను నిలుపుదల చేశామని చెప్పా రు. కంటైనర్‌లో పరిశీలించగా, అందులో 40 పశువులను ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్నట్టు గుర్తించామని ఆయన తెలిపారు. ఈ కంటైనర్‌ పార్వతీపురం నుంచి హైదరాబాద్‌ వెళ్తోందన్నారు. వాహనాన్ని సీజ్‌ చేసి, డ్రైవర్‌ ఆర్‌.అర్జున్‌ను అదుపు లోకి తీసుకున్నట్టు హెచ్‌సీ చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నా మన్నారు.

Updated Date - 2023-03-26T00:12:44+05:30 IST