సామాన్యులకు అందుబాటులో బ్యాంకింగ్‌ సేవలు

ABN , First Publish Date - 2023-05-27T00:30:30+05:30 IST

సామాన్య, మధ్యతరగతి వర్గా లతో పాటు చిన్న చిన్న వ్యాపా రస్తులకూ మెరుగైన సేవలం దించే లక్ష్యంతో బ్యాంకు పాలక వర్గం కృషి చేస్తోందని విశాఖప ట్నం కోఆపరేటివ్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ చెరువు ఆదినారాయణ శాస్త్రి స్పష్టం చేశారు.

సామాన్యులకు అందుబాటులో బ్యాంకింగ్‌ సేవలు

రాజాం రూరల్‌, మే 26: సామాన్య, మధ్యతరగతి వర్గా లతో పాటు చిన్న చిన్న వ్యాపా రస్తులకూ మెరుగైన సేవలం దించే లక్ష్యంతో బ్యాంకు పాలక వర్గం కృషి చేస్తోందని విశాఖప ట్నం కోఆపరేటివ్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ చెరువు ఆదినారాయణ శాస్త్రి స్పష్టం చేశారు. రాజాంలోని ఓ ప్రయివేటు కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన బ్రాంచి సభ్యుల మహాసభలో ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొని మాట్లా డారు. వ్యాపారస్తుల వ్యాపార సామర్ధ్యం ఆధారంగా అన్నివర్గాల వారికి రుణ సదుపా యం కల్పిస్తున్నామన్నారు. రాజాం బ్రాంచి పరిధిలో ఇప్పటివరకూ రూ.39.20 కోట్లు రుణాలుగా అందించామని, సుమారు రూ.10 కోట్లు డిపాజిట్లుగా సేకరించామన్నారు. చిన్నచిన్న వ్యాపారస్తులకు ఆర్థికంగా అండనిచ్చి వారి అభివృద్ధే ధ్యేయంగా కో ఆపరే టివ్‌ బ్యాంకు ముందుకు సాగుతోందని ఆయన వివరించారు. ఖాతాదారులకు బీమా సదుపాయంతో పాటు అనేక సంక్షేమ, వైద్య పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నా మని వివరించారు. రాజాం బ్రాంచి మేనేజర్‌ జి.వి.ఎల్‌. ప్రకాశరావు అధ్యక్షతన జరి గిన కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు కండాపు ప్రసాదరావు, ఉప్పలపాటి పార్వతీ దేవి బ్యాంకు ప్రగతిని వివరించారు. జోనల్‌ మేనేజర్‌ గుడ్ల రమణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2023-05-27T00:30:30+05:30 IST