Share News

మళ్లీ ప్రజల్లోకి..

ABN , First Publish Date - 2023-12-11T00:21:51+05:30 IST

జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు అనంతరం ఈ కార్య క్రమానికి కొన్ని రోజులు బ్రేక్‌ పడింది. అయితే, చంద్రబాబు బెయిల్‌పై విడుదలైన తర్వాత టీడీపీ నాయకులు మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు.

 మళ్లీ ప్రజల్లోకి..

- జిల్లాలో జోరుగా బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం

- ఉత్సాహంగా నిర్వహిస్తున్న టీడీపీ శ్రేణులు

పార్వతీపురం, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు అనంతరం ఈ కార్య క్రమానికి కొన్ని రోజులు బ్రేక్‌ పడింది. అయితే, చంద్రబాబు బెయిల్‌పై విడుదలైన తర్వాత టీడీపీ నాయకులు మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జిలు బోనెల విజయచంద్ర, తోయక జగదీశ్వరి, గుమ్మిడి సంధ్యారాణి, నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఎంతో హుషారుగా నిర్వహిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయనున్న సంక్షేమ పథకాల గూర్చి ప్రజలకు వివరిస్తున్నారు. మేనిఫెస్టోను తెలియజేస్తూ కరపత్రాలు అందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరుతున్నారు.

Updated Date - 2023-12-11T00:21:53+05:30 IST