నల్ల బ్యాడ్జీలతో అంగన్వాడీల నిరసన
ABN , First Publish Date - 2023-12-03T00:04:58+05:30 IST
ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకుంటే ఈనెల 8 నుంచి నిరవదిక సమ్మెకు దిగుతామని మరుపల్లి సెక్టార్ నాయకురాలు నారాయణమ్మ తెలిపారు.
గజపతినగరం: ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకుంటే ఈనెల 8 నుంచి నిరవదిక సమ్మెకు దిగుతామని మరుపల్లి సెక్టార్ నాయకురాలు నారాయణమ్మ తెలిపారు. ఈ మేరకు శనివారం మధుపాడ గ్రామంలోగల అంగన్ వాడీ కేంద్రం వద్ద ఆమె తోపాటు పలువురు నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నాలు గేళ్లయినా నెరవేర్చకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో సాయి, లక్ష్మి, వెంకటలక్ష్మి, దుర్గా తదితరులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్చేస్తూ అంగన్వాడీ వర్కర్క్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మండలంలోని అంగన్వాడీ సిబ్బంది శనివారం నల్లబాడ్జీలతో విధులకు హాజరయ్యారు. యూనియన్ నాయకురాలు మంగవేణి ఆధ్వర్యంలో సచివాలయ కార్యదర్శులకు, పలువురు సర్పంచ్లకు వినతిపత్రాలు అందజేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు.