బెదిరింపులకు పాల్పడితే చర్యలు: ఏఎస్పీ
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:49 PM
kk
విజయనగరం క్రైం: జిల్లాలోనిపోలీసుస్టేషన్ల పరిధిలో బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్ప డేవారిపై విచారణ చేపట్టి చర్య లు తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ ఆష్మాపరహీన్ ఆదేశించా రు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ దీపికా ఆదే శాల మేరకు నిర్వహించిన స్పం దన కార్యక్రమంలో 34 ఫిర్యాదులు స్వీకరించారు. తన భూమి కొందరు ఆక్రమిం చారని, ఈవిషయంపై న్యాయస్థానంలో కేసు నడుస్తోందని,తనను భూమి మీదకు రాకుండా దౌర్జన్యానికి పాల్పడుతు న్నారని, దీంతో న్యాయంచేయాలని గుర్ల మం డలం జమ్ముగ్రామానికి చెందిన ఓవ్యక్తి కోరాడు. చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని గుర్ల ఎస్ఐని ఏఎస్పీ ఆదేశించారు. తక్షణమే ఆయా సమస్యలు పరిష్కరించి తీసుకున్న చర్యలను తక్షణమే ఎస్పీ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో దిశా డీఎస్పీ ఆర్.శ్రీని వాసరావు, ఎస్ఐలు వాసుదేవ్ పాల్గొన్నారు.