నాగావళి నదిలో యువకుడి గల్లంతు

ABN , First Publish Date - 2023-03-31T00:11:34+05:30 IST

మండలంలోని కొత్తూరుగ్రామానికి చెందిన యువకుడు గురువా రం నాగావళి నదిలో గల్లంతయ్యాడు.

నాగావళి నదిలో యువకుడి గల్లంతు

గరుగుబిల్లి: మండలంలోని కొత్తూరుగ్రామానికి చెందిన యువకుడు గురువా రం నాగావళి నదిలో గల్లంతయ్యాడు. ఏఎస్‌ఐ రవికుమార్‌ కథనం మేరకు... కొత్తూరుకు చెందిన అన్ను కార్తీక్‌ (17) గురువారం పశువులను మేతకు నది ఒడ్డుకు తీసుకువెళ్లాడు. రెండు ఆవులు నది దాటి ఆవల వైపునకు వెళ్లడంతో నదిలోకి దిగాడు. పైనుంచి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతోపాటు నదిలో గోతులు ఉండడంతో ఉధృతికి గల్లంతయ్యాడు. బబ రక్షించేందుకు ఈతగాళ్లను రంగంలో దించినా ఆచూకీ లభించలేదు. కార్తీక్‌ నదిలో గల్లంతుకావడంతో తండ్రి వెంకటి, తల్లి అనూషలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కార్తీక్‌ గల్లంతుకావడంపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-03-31T00:11:34+05:30 IST