ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృతి

ABN , First Publish Date - 2023-03-26T00:11:50+05:30 IST

మండలంలోని ముంగినాపల్లి కూడలి వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది.

 ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృతి

డెంకాడ: మండలంలోని ముంగినాపల్లి కూడలి వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. డెంకాడ ఎస్‌ఐ యు.మ హేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్త ముంగినాపల్లి గ్రామానికి చెందిన బొబ్బాది సూరమ్మ(61) అనే మహిళ రోడ్డు దాటుతుండగా, విజయనగరం నుంచి చొల్లంగిపేట వెళుతున్న ద్విచక్రవాహనం బలంగా ఢీకొంది. తలకు బలమైన గాయాలు కావడంతో సూరమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం కేంద్రాసుప త్రికి తరలించామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-03-26T00:11:50+05:30 IST