ట్రాక్టర్ ఢీకొని వ్యక్తికి గాయాలు
ABN , First Publish Date - 2023-03-31T00:13:22+05:30 IST
ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
పార్వతీపురంటౌన్: ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లా ఆసుపత్రి ఔట్పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మక్కువ మండలం మార్కొండపుట్టి గ్రామానికి చెందిన ఎల్.పోలినా యుడు గురువారం తన పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై పార్వతీపురం వస్తుండగా, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో పోలినాయు డుకు కుడికాలితో పాటు పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతుడిని బంధువులు జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఔట్పోస్టు పోలీసులు తెలిపారు.