రోడ్డు పనులతో నిలిచిన బస్సు

ABN , First Publish Date - 2023-02-01T23:35:37+05:30 IST

పాలకొండ ఆర్టీసీ డిపోకు చెందిన అంటికొండకు వెళ్లే పల్లె వెలుగు బస్సునాలుగురోజులుగా నిలిచి పోవడంతో ప్రయాణికులు అవస్థలకు గురవుతున్నారు.

 రోడ్డు పనులతో నిలిచిన బస్సు

సీతంపేట: పాలకొండ ఆర్టీసీ డిపోకు చెందిన అంటికొండకు వెళ్లే పల్లె వెలుగు బస్సునాలుగురోజులుగా నిలిచి పోవడంతో ప్రయాణికులు అవస్థలకు గురవుతున్నారు. జి.గుమ్మడ నుంచి జల్లారి వరకు రెండు కిలోమీటర్ల మేర బీటీరోడ్డు పనులు జరుగుతున్నాయి. దీంతో పాలకొండ నుంచి అంటికొండకు వెళ్లే ఆర్టీసీ సర్వీసును నిలిపివేయడంతో విద్యార్థులు, గిరిజనులు, 30 గ్రామాల ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. ఈ ఒక్క బస్సు ప్రతిరోజూ నాలుగు సార్లు తిరగడంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరుకునే వారు. దీంతో అధిక చార్జీలు చెల్లించి ఆటోలకు రావాల్సివస్తోందని పలువురు వాపోతున్నారు.

Updated Date - 2023-02-01T23:35:39+05:30 IST