బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి వంగవీటి
ABN , First Publish Date - 2023-09-04T00:16:14+05:30 IST
డుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి దివంగత వంగవీటి మోహన్రంగా అని ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు అన్నారు.
బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 3 : బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి దివంగత వంగవీటి మోహన్రంగా అని ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని లోపూడిలో ఆదివారం రాత్రి వంగవీటి మోహన్రంగా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడుతూ రంగా మన మధ్య లేకపోయినా 34 సంవత్సరాలుగా ప్రజల గుండెల్లో ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాధారంగ మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కాళ్ళపాలెం బుజ్జి, మాలమహానాడు జిల్లా అధ్యక్షురాలు నాగమల్లీశ్వరి, జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎస్ఎన్ రాజు, వైసీపీ వడ్డాది పట్టణ అధ్యక్షుడు దొండా నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.