సూర్యనారాయణస్వామివారిని దర్శించుకున్న గంటా, పీలా
ABN , First Publish Date - 2023-06-02T23:53:48+05:30 IST
మండలంలోని రాజుపాలెంలో గల సూర్యనారాయణస్వామిమూర్తిని శుక్రవారం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ దర్శించుకున్నారు.
అనకాపల్లి రూరల్, జూన్ 2 : మండలంలోని రాజుపాలెంలో గల సూర్యనారాయణస్వామిమూర్తిని శుక్రవారం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కళ్యాణ్కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే మూడు రోజులుగా ఆలయంలో జరుగుతున్న మహాలక్ష్మిసమేత వైకుంఠ నారాయణ విగ్రహా ఆవిష్కరణ, వేంకటేశ్వర లక్ష్మీనారాయణ సమేత ధ్వజస్తంభం ప్రతిష్టాపనకు వచ్చిన చినజీయర్స్వామిని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ హయాంలో ఆలయంలో జరిగిన అభివృద్ధి, టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టేబోయే అభివృద్ధి కార్యక్రమాలను చినజీయర్స్వామికి వారు వివరించారు.