విద్యార్థి ఆత్మహత్యా యత్నం

ABN , First Publish Date - 2023-02-13T00:08:04+05:30 IST

తనపై దొంగతనం నేరం మోపారని మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్యా యత్నానికి ఓ విద్యార్థి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.

విద్యార్థి ఆత్మహత్యా యత్నం

దొంగతనం నేరం మోపారన్న మనస్తాపంతో..

పెందుర్తి-రూరల్‌, ఫిబ్రవరి 12: తనపై దొంగతనం నేరం మోపారని మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్యా యత్నానికి ఓ విద్యార్థి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. జీవీఎంసీ 95వ వార్డు పరిధి లక్ష్మీపురం పోర్టు కాలనీకి చెందిన కనకాల సాయితేజ (13) చింతల అగ్రహారం జెడ్పీ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం స్థానికంగా గల ఒక చెట్టుపై వున్న తేనె పట్టును తీసేందుకు గాను ఆ చెట్టుకు ఆనుకుని వున్న గోడ ఎక్కుతుండగా సమీపంలోని నివాసితులు సాయితేజను పట్టుకుని దొంగతనానికి వచ్చావా అంటూ తీవ్రంగా మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన సాయితేజ చీకటిపడ్డాక సమీపంలోని చింతల అగ్రహారం వద్దనున్న అండర్‌ పాస్‌వే ప్రాంతానికి వెళ్లి రైలు ట్రాక్‌పై నిలబడి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అయితే రైలు సమీపించగానే ప్రాణ భీతితో పక్కకు తప్పకునేందుకు యత్నించి అండర్‌ పాస్‌వే గోడపై పడిపోయాడు. తలకు తీవ్ర గాయలవ్వడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానిక యువకులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించి చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సాయితేజ జేబులో లభించిన లేఖ ఆధారంగా పెందుర్తి పోలీసులు ప్రాథమిక విచారణ చేశారు. ప్రస్తుతం సాయితేజ కోలుకుంటున్నట్టు తెలిపారు.

Updated Date - 2023-02-13T00:08:07+05:30 IST