నేడు రాష్ట్ర గవర్నర్ రాక
ABN , Publish Date - Dec 26 , 2023 | 01:14 AM
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నాలుగు రోజుల పర్యటనకు మంగళవారం రాత్రి నగరానికి రానున్నారు.
విశాఖపట్నం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నాలుగు రోజుల పర్యటనకు మంగళవారం రాత్రి నగరానికి రానున్నారు. మంగళవారం సాయంత్రం విజయవాడ నుంచి రైలులో బయలుదేరి రాత్రికి విశాఖ చేరుకుని నోవాటెల్లో బస చేస్తారు. 27న హోటల్లోనే ఉంటారు. 28న ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. ఆరోజు రాత్రి నోవాటెల్లో బసచేసి 29వ తేదీ ఉదయం రైలులో బయలుదేరి విజయవాడ వెళతారు.