ఐదు నుంచి రైతు రక్షణ కోసం జీపు జాతా

ABN , First Publish Date - 2023-06-02T23:52:33+05:30 IST

కౌలు రైతుల రక్షణ కోసం ఈనెల ఐదో తేదీ నుంచి మునగపాకలో రాష్ట్ర జీపు జాతా బయలుదేరుతుందని జిల్లా కౌలు రైతుల సంఘం కార్యదర్శి ఎ.బాలకృష్ణ పేర్కొన్నారు.

ఐదు నుంచి రైతు రక్షణ కోసం జీపు జాతా
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న రైతు నాయకులు

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 2 : కౌలు రైతుల రక్షణ కోసం ఈనెల ఐదో తేదీ నుంచి మునగపాకలో రాష్ట్ర జీపు జాతా బయలుదేరుతుందని జిల్లా కౌలు రైతుల సంఘం కార్యదర్శి ఎ.బాలకృష్ణ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం దొడ్డి రామునాయుడు భవనంలో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కె.లోకనాథం, గాడి బాలు, ఆళ్ల మహేశ్వరరావు, వీవీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:52:33+05:30 IST