గ్రూపు-2 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయండి

ABN , First Publish Date - 2023-06-03T00:43:39+05:30 IST

రాష్ట్రంలో గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని అమరావతిలో గురువారం ఏపీ పీఎస్సీ చైర్మన్‌ గౌతం సవాంగ్‌, కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌లను గురువారం కలిసి కోరినట్టు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు తెలిపారు.

గ్రూపు-2 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయండి
కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌కు వినతి ప్రతాన్ని అందజేస్తున్న ఎమ్మెల్సీ చిరంజీవిరావు

బుచ్చెయ్యపేట, జూన్‌ 2 : రాష్ట్రంలో గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని అమరావతిలో గురువారం ఏపీ పీఎస్సీ చైర్మన్‌ గౌతం సవాంగ్‌, కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌లను గురువారం కలిసి కోరినట్టు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడి విలేకరులతో ఫోన్‌లో మాట్లాడారు. గ్రూప్‌-2లో డీఎల్‌, జేఎల్‌, ఏఈఈ ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. గతంలో మంజూరై వేర్వేరు కారణాలతో నిలిచిపోయిన పోస్టుల భర్తీ కూడా చేపట్టాలని విన్నవించామన్నారు. ప్రస్తుతం రెండు వందల గ్రూప్‌-2 పోస్టులకు ఆర్థిక అనుమతులు లభించాయని, మిగిలిన వాటికి ఆర్థిక అనుమతులు లభించిన వెంటనే వాటి భర్తీకి సైతం చర్యలు చేపడతామని గౌతం సవాంగ్‌ చెప్పినట్టు ఎమ్మెల్సీ తెలిపారు.

Updated Date - 2023-06-03T00:43:39+05:30 IST