దువ్వాడ మీదుగా రాంచి-విల్లుపురం ప్రత్యేక రైలు
ABN , First Publish Date - 2023-02-01T23:48:55+05:30 IST
ప్రయాణికుల సౌకర్యార్ధం దువ్వాడ మీదుగా రాంచి, విల్లుపురం మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను ప్రవేశపెడుతున్నట్టు సీనియర్ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు.
విశాఖపట్నం, ఫిబ్రవరి 1: ప్రయాణికుల సౌకర్యార్ధం దువ్వాడ మీదుగా రాంచి, విల్లుపురం మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను ప్రవేశపెడుతున్నట్టు సీనియర్ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు. 08068 నంబరు గల రైలు ఈనెల మూడు నుంచి 24వ తేదీ వరకు ప్రతి శుక్రవారం రాత్రి 11.55 గంటలకు రాంచిలో బయలుదేరి మర్నాడు రాత్రి 8:43 గంటలకు దువ్వాడ, ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు విల్లుపురం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08067 నంబరు గల రైలు ఈ నెల ఏడు నుంచి 28వ తేదీ వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 5:15 గంటలకు విల్లుపురంలో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 12:08 గంటలకు దువ్వాడ, గురువారం ఉదయం 6:45 గంటలకు రాంచి చేరుతుంది.
షాలిమార్, తాంబరం ప్రత్యేక రైలు రద్దు
షాలిమార్, తాంబరం మధ్య ప్రవేశపెట్టిన ప్రత్కేక రైలు సర్వీసులను సాంకేతిక కారణాల వలన రద్దు చేస్తున్నట్టు సీనియర్ డీసీఎం ప్రకటించారు.