Share News

శివపార్వతుల విగ్రహాల ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2023-11-28T00:36:04+05:30 IST

మండలంలోని తాజంగి పంచాయతీ కేంద్రం దొంతులమ్మ కొండపై ఆలయ కమిటీ, భక్తులు ఏర్పాటు చేసిన శివపార్వతుల విగ్రహాలను భీమిలి సద్గురు స్వామి సాయిరామ్‌ ప్రారంభించారు.

శివపార్వతుల విగ్రహాల ప్రతిష్ఠ
దొంతులమ్మ కొండపై ప్రతిష్ఠించిన శివపార్వతుల విగ్రహాలు

చింతపల్లి, నవంబరు 27: మండలంలోని తాజంగి పంచాయతీ కేంద్రం దొంతులమ్మ కొండపై ఆలయ కమిటీ, భక్తులు ఏర్పాటు చేసిన శివపార్వతుల విగ్రహాలను భీమిలి సద్గురు స్వామి సాయిరామ్‌ ప్రారంభించారు. సోమవారం వేకువజాము నుంచి కొండపైనున్న అమ్మవారి ఆలయంలో సద్గురు స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శివపార్వతులకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేసి వస్త్రాలు సమర్పించి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రవచనకర్త కొండవీటి జ్యోతిర్మయి, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T00:36:06+05:30 IST