చంద్రబాబుకు పాలాభిషేకం
ABN , First Publish Date - 2023-03-26T00:30:04+05:30 IST
టీడీపీ శాసనమండలి సభ్యురాలిగా బీసీ మహిళ పంచుమర్తి అనూరాధను గెలిపించినందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
మహారాణిపేట, మార్చి 25: టీడీపీ శాసనమండలి సభ్యురాలిగా బీసీ మహిళ పంచుమర్తి అనూరాధను గెలిపించినందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడుకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ నాయకులు ఎ. మధుసూధనరావు, బొట్టా పరదేశీయాదవ్ ు కోనేటి సురేష్, శీరం రాజేష్, అప్పల నారాయణరావు, జట్లయ్య, కె.రామారావు, కె.రామకృష్ణ, వెంకట లక్ష్మి భారతి తదితరులు పాల్గొన్నారు.