లంకెలపాలెంలో పట్టణ పీహెచ్సీ ప్రారంభం
ABN , First Publish Date - 2023-04-26T00:46:49+05:30 IST
పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో రూ.399 కోట్లు వ్యయం చేసి రాష్ట్ర వ్యాప్తంగా 525 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని పేర్కొన్నారు.
లంకెలపాలెం, ఏప్రిల్ 25: పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో రూ.399 కోట్లు వ్యయం చేసి రాష్ట్ర వ్యాప్తంగా 525 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని పేర్కొన్నారు. జీవీఎంసీ 85వ వార్డు పరిధి లంకెలపాలెంలో నిర్మించిన పట్టణ పీహెచ్సీని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బందితోపాటు 172 రకాల ఔషధాలు అందుబాటులో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్, జిల్లా కలెక్టర్ రవి పట్టన్శెట్టి, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్వర్మ, డీఎంహెచ్వో హేమంత్, కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి, వైసీపీ నాయకులు పైలా శ్రీనివాసరావు, ప్రసాద్, మహాలక్ష్మినాయుడు, సుందరపు అప్పారావు, కింతాడ ఈశ్వరరావు, కర్రి నరసింగరావు, తదితరులు పాల్గొన్నారు.