నేవీ రోడ్డు బురదమయం
ABN , First Publish Date - 2023-09-20T01:28:00+05:30 IST
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలో ఎన్ఏవోబీ ప్రధాన రహదారి బురదమయమైంది. అప్పన్నపాలెం కాలనీ సమీపంలో వాహనాలు బురదలో కూరుపోతున్నాయి. దీందో వాహనదారులతోపాటు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యామ్నాయ నేవల్ బేస్ ఏర్పాటు కావడంతో మండలంలో వెంకటాపురం జంక్షన్ నుంచి వాడనర్సాపురం సమీపంలోని ఎన్ఏవోబీ గేటు వరకు కొత్తగా రోడ్డు నిర్మించారు.

కూరుకుపోయిన వాహనాలు, స్తంభించిన ట్రాఫిక్
రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
రాంబిల్లి, సెప్టెంబరు 19 : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలో ఎన్ఏవోబీ ప్రధాన రహదారి బురదమయమైంది. అప్పన్నపాలెం కాలనీ సమీపంలో వాహనాలు బురదలో కూరుపోతున్నాయి. దీందో వాహనదారులతోపాటు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యామ్నాయ నేవల్ బేస్ ఏర్పాటు కావడంతో మండలంలో వెంకటాపురం జంక్షన్ నుంచి వాడనర్సాపురం సమీపంలోని ఎన్ఏవోబీ గేటు వరకు కొత్తగా రోడ్డు నిర్మించారు. ఈ మార్గంలో సాధారణ వాహనాలతోపాటు భారీ వాహనాల రాకపోకలు అధికంగా ఉండడంతో పలుచోట్ల గోతులు ఏర్పడి అధ్వానంగా తయారైంది. కొన్ని గోతులను స్థానికులు గ్రావెల్, మట్టితో పూడ్చుకున్నారు. మిగిలిన చోట్ల వర్షం కురిస్తే గోతుల్లో నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. గోతుల్లో గ్రావెల్, మట్టి వేసిన చోట వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. అప్పన్నపాలెం కాలనీ జంక్షన్ వద్ద రోడ్డు మధ్య ఏర్పడిన భారీగొయ్యిలో మంగళవారం టాటా ఏస్ వాహనం కూరుకుపోయింది. మిగిలిన ప్రదేశం బురదగా వుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఆటోలు, వ్యాన్ల డ్రైవర్లు వాహనాల్లో నుంచి ప్రయాణికులను కిందకు దించి, ఖాళీ వాహనాన్ని బురదగా వున్న ప్రదేశం దాటించాల్సి పరిస్థితి నెలకొంది. పాదచారులు, ద్విచక్రవాహదారులు ఇక్కట్లు వర్ణనాతీతం.. వర్షం పడినప్పడల్లా ఇదే పరిస్థితి నెలకొంటున్నదని, అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడిన గోతులను కనీసం మెటల్తో పూడ్చాలని ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.