ఎమ్మెల్యేతో నేవీ నిర్వాసితుల జేఏసీ నేతల భేటీ
ABN , First Publish Date - 2023-03-26T01:39:02+05:30 IST
నేవీ నిర్వాసిత సమస్యల పరిష్కారమై శనివారం జేఏసీ నాయకులు ఎలమంచిలి ఎమ్మె ల్యే రమణ మూర్తి రాజుతో శనివారం సమా వేశ మయ్యారు.
జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఫిషరీష్ జేడీతో మాట్లాడిన ఎమ్మెల్యే
రాంబిల్లి, మార్చి 25 : నేవీ నిర్వాసిత సమస్యల పరిష్కారమై శనివారం జేఏసీ నాయకులు ఎలమంచిలి ఎమ్మె ల్యే రమణ మూర్తి రాజుతో శనివారం సమా వేశ మయ్యారు. విశాఖలోని ఎమ్మెల్యే స్వగృ హంలో నిర్వాసితుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి జేఏసీ నాయకులు తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రమణమూర్తిరాజు.. నేవీ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, మరోమారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే రమణమూర్తిరాజు జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి ప్రతి రేషన్ కార్డుదారునికి రూ.1.3 లక్షల ప్యాకేజీ ఇవ్వడంతోపాటు ప్రతి నెల జీవనభృతి ఇవ్వడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. అనంతరం ఎమ్మెల్యే రమణమూర్తిరాజు ఆర్డీఓతో మాట్లాడి మినిట్స్ కాపీ సోమవారం నాటికి ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. జేడీ ఫిషరీస్తో కూడా మాట్లాడారని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని నేవీ నిర్వాసిత జేఏసీ నేతలు తెలిపారు.