మే 14 నుంచి మోదకొండమ్మ ఉత్సవాలు
ABN , First Publish Date - 2023-03-08T00:28:13+05:30 IST
రాష్ట్రంలో పెద్ద గిరిజన పండగగా గుర్తింపు పొందిన స్థానిక మోదకొండమ్మ ఉత్సవాలు మే నెల 14, 15 16 తేదీల్లో నిర్వహించనున్నారు.
నేడు ఉత్సవ కమిటీని ఖరారు చేయనున్న ఆలయ కమిటీ
పాడేరు, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెద్ద గిరిజన పండగగా గుర్తింపు పొందిన స్థానిక మోదకొండమ్మ ఉత్సవాలు మే నెల 14, 15 16 తేదీల్లో నిర్వహించనున్నారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన కమిటీని నియమించడంతోపాటు ఉత్సవ తేదీలను బుధవారం సాయంత్రం మోదకొండమ్మ ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు(ఎమ్మెల్యే) కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, కొట్టగుళ్లి సింహాచలంనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ప్రకటించనున్నారు. ప్రతి ఏడాది మే నెలలో మూడు రోజుల పాటు మోదకొండమ్మ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాలకు స్థానిక భక్తులతోపాటు ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తున్నది. గతం కంటే భిన్నంగా మరింత వైభవంగా ఈ ఏడాది మోదకొండమ్మ ఉత్సవాలను నిర్వహించాలని ఆలయ కమిటీ భావిస్తున్నది.