గాడు అప్పలనాయుడును కలిసిన ఎమ్మెల్సీ చిరంజీవిరావు

ABN , First Publish Date - 2023-03-31T00:59:54+05:30 IST

భీమిలికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు గాడు అప్పలనాయుడును గురువారం రాత్రి ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మర్యాదపూర్వకంగా కలిశారు.

గాడు అప్పలనాయుడును కలిసిన ఎమ్మెల్సీ చిరంజీవిరావు
అప్పలనాయుడుకు పండ్లు అందజేస్తున్న చిరంజీవిరావు

భీమునిపట్నం, మార్చి 30: భీమిలికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు గాడు అప్పలనాయుడును గురువారం రాత్రి ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక చిన్నబజారులో వున్న అప్పలనాయుడు కార్యాలయానికి ఆయన వచ్చి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవిరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రాడ్యుయేట్లు ఎంతో శ్రమించి తన గెలుపునకు సహకరించారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ముఖ్యంగా రెండో వార్డు కార్పొరేటర్‌ గాడు చిన్నికుమారిలక్ష్మికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, నాయకులు గొలగాని నరేంద్రకుమార్‌, కాసరపు నాగరాజు, కొక్కిరి అప్పన్న, కె.అప్పలనాయుడు, ఎ.నూకరాజు, అప్పలరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:59:54+05:30 IST