‘జనసేన విజయానికి కృషి చేయాలి’
ABN , First Publish Date - 2023-03-31T01:16:51+05:30 IST
వచ్చే శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి జనసైనికులంతా తమ వంతు కృషి చేయాలని జనసేన పార్టీ ఉత్తరాంధ్ర ప్రతినిధి సుందరపు విజయ్కుమార్ అన్నారు.
ఎలమంచిలి, మార్చి 30: వచ్చే శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి జనసైనికులంతా తమ వంతు కృషి చేయాలని జనసేన పార్టీ ఉత్తరాంధ్ర ప్రతినిధి సుందరపు విజయ్కుమార్ అన్నారు. గురువారం స్థానిక కల్యాణ మండపంలో పట్టణ, మండల కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ విధి విధానాలను పార్టీ నేతలకు, జనసైనికులకు సుందరపు దిశా నిర్ధేశం చేశారు. అనంతరం పార్టీ పట్టణ, మండల కమిటీలను ప్రకటించారు. పట్టణ అధ్యక్షుడిగా బొద్దపు శ్రీను, కార్యదర్శిగా కె.రామకృష్ణలను ఎన్నుకున్నారు. అదేవిధంగా మండల అధ్యక్షునిగా లాలం సోమునాయుడు, ప్రధాన కార్యదర్శిగా ఎస్.నానాజీ ఎన్నుకున్నారు.