విస్సన్నపేట భూ కుంభకోణం నిగ్గు తేల్చుతాం
ABN , First Publish Date - 2023-02-07T01:06:42+05:30 IST
కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ విస్సన్నపేట భూముల ఆక్రమణలపై ఈనెల తొమ్మిదో తేదీన ఉమ్మడి విశాఖ జిల్లాల జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన చేయనుందని, మంత్రి అమర్నాథ్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి దూలం గోపి అన్నారు.
అనకాపల్లి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ విస్సన్నపేట భూముల ఆక్రమణలపై ఈనెల తొమ్మిదో తేదీన ఉమ్మడి విశాఖ జిల్లాల జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన చేయనుందని, మంత్రి అమర్నాథ్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి దూలం గోపి అన్నారు. సోమవారం ఆయన అనకాపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విస్సన్నపేట సర్వే నెంబరు 195/2లో జరిగిన భూ ఆక్రమణల వ్యవహారంపై నిగ్గు తేలే వరకు పోరాడుతుందన్నారు. పార్టీ అధినేత పవన్కల్యాణ్ ఆదేశాల మేరకు ఈ భూ ఆక్రమణల వివరాలను తెలుసుకుంటామని చెప్పారు. ఈ భూ కుంభకోణంలో తెర వెనుక పాత్రధారులు, సూత్రధారుల బండారాన్ని బయట పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొనాల్సిందిగా ఆయన కోరారు. ఈ సమావేశంలో పార్టీ అనకాపల్లి నాయకులు తాడి రామకృష్ణ, మళ్ల శ్రీను, తాకాసి సత్యం దొర, అప్పికొండ గణేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.