తొలి మేనిఫెస్టోతో అన్నివర్గాలకు మేలు

ABN , First Publish Date - 2023-06-26T01:32:47+05:30 IST

తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రకటించిన తొలి మేనిఫెస్టో రాష్ట్రంలోని అన్నివర్గాలకు మేలు చేకూర్చుతుందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

తొలి మేనిఫెస్టోతో అన్నివర్గాలకు మేలు
కొత్తఎల్లవరంలో పల్లె నిద్ర చేస్తున్న అయ్యన్నపాత్రుడు తదితరులు

వైసీపీ పాలనతో ప్రజలు విసుగు

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం టీడీపీదే

గొలుగొండ , జూన్‌ 25 : తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రకటించిన తొలి మేనిఫెస్టో రాష్ట్రంలోని అన్నివర్గాలకు మేలు చేకూర్చుతుందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో టీడీపీ చేపట్టిన బస్సు యాత్ర శనివారం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో సాగి, రాత్రి గొలుగొండ మండలం ఎర్రవరానికి చేరుకుంది. పల్లె నిద్రలో భాగంగా గ్రామంలోని సర్పంచ్‌ కొల్లు ్లరాంబాబు ఇంట సదరు నాయకులంతా సబ చేశారు. ఆదివారం ఉదయం చోడవరం నియోజకవర్గానికి బయల్దేరే ముందు అయ్యన్న విలేకరులతో మాట్లాడారు. అభి వృద్ధి, సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసే సత్తా చంద్రబాబుకు మాత్రమే సాధ్యమన్నారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో విసిగిపోయిన రాష్ట్ర ప్రజానీకం ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.రాజు, పార్టీ గొలుగొండ మండల అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, కొత్తఎల్లవరం సర్పంచ్‌ కొల్లు రాంబాబుతో పలు పలువురు సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, నాయకులు చోడవరం నియోజకవర్గానికి బయల్దేరి వెళ్లారు.

‘నాయకుల స్వలాభం కోసమే యాత్ర’

నర్సీపట్నం అర్బన్‌ : టీడీపీ నాయకుల భవిష్యత్తు కోసమే బస్సుయాత్ర చేపడుతున్నారని ఎమ్మెల్యే గణేశ్‌ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో హామీలను పూర్తిగా నెరవేర్చలేదన్నారు. ప్రస్తుతం ప్రజలను మోసం చేసేందుకే బస్సు యాత్ర చేపడుతున్నారన్నారు. హామీలు అమలు చేసిన ఘనతన జగన్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.

Updated Date - 2023-06-26T01:32:47+05:30 IST