Share News

ఓటరు జాబితాపై క్షేత్ర స్థాయి పరిశీలన

ABN , Publish Date - Dec 23 , 2023 | 12:59 AM

ఓటరు జాబితాపై అరకులోయలో శుక్రవారం క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ఓటరు జాబితా జిల్లా పరిశీలకుడు జె.శ్యామలరావు, జాయింట్‌ కలెక్టర్‌ శివశ్రీనివాసు, ఐటీడీఏ పీవో అభిషేక్‌ పలు వీధుల్లో పర్యటించి ఇంటింటా పరిశీలన చేశారు. కొత్త ఓటర్ల నమోదు, వలస వెళ్లిన వారు, మృతుల ఓట్ల తొలగింపు, బీఎల్‌ఓల పనితీరు వంటి అంశాలపై వారు ఆరా తీశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌, బీఎల్‌వోలతపై వారు సమావేశమయ్యారు.

ఓటరు జాబితాపై క్షేత్ర స్థాయి పరిశీలన
పాత పోస్టాఫీసు ప్రాంతంలో పర్యటిస్తున్న శ్యామలరావు తదితరులు

అరకులోయ, డిసెంబరు 22: ఓటరు జాబితాపై అరకులోయలో శుక్రవారం క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ఓటరు జాబితా జిల్లా పరిశీలకుడు జె.శ్యామలరావు, జాయింట్‌ కలెక్టర్‌ శివశ్రీనివాసు, ఐటీడీఏ పీవో అభిషేక్‌ పలు వీధుల్లో పర్యటించి ఇంటింటా పరిశీలన చేశారు. కొత్త ఓటర్ల నమోదు, వలస వెళ్లిన వారు, మృతుల ఓట్ల తొలగింపు, బీఎల్‌ఓల పనితీరు వంటి అంశాలపై వారు ఆరా తీశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌, బీఎల్‌వోలతపై వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ క్షేత్ర స్థాయి పరిశీలన తరువాతే మృతుల ఓట్లు తొలగించాలని, ఇళ్లకు నంబర్‌ లేకపోతే వెంటనే గుర్తించి ఇంటి నంబర్‌ ఇచ్చి ఓటరు గుర్తింపు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం బీఎల్‌వోలతో జేసీ, ఐటీడీఏ పీవో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో అరకు లోయ తహసీల్దార్‌ వేణుగోపాల్‌, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 12:59 AM