ఎగ్జిబిషన్‌ ప్రచార వాహనం ప్రారంభం

ABN , First Publish Date - 2023-02-07T00:59:57+05:30 IST

కేంద్ర బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈనెల 7,8 తేదీల్లో నర్సీపట్నం ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించబోయే ఫొటో ప్రదర్శన ప్రచార వాహనాన్ని సోమవారం ఆర్డీవో జయరాం జెండా ఊపి ప్రారంభించారు.

ఎగ్జిబిషన్‌ ప్రచార వాహనం ప్రారంభం
ఎగ్జిబిషన్‌ ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఆర్డీవో జయరాం

నర్సీపట్నం అర్బన్‌ , ఫిబ్రవరి 6: కేంద్ర బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈనెల 7,8 తేదీల్లో నర్సీపట్నం ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించబోయే ఫొటో ప్రదర్శన ప్రచార వాహనాన్ని సోమవారం ఆర్డీవో జయరాం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సంబరాల్లో భాగంగా ఈ ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశామన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ సహాయ సంచాలకులు షఫీ మహ్మద్‌, మునిసిపల్‌ కమిషనర్‌ కనకారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:59:59+05:30 IST