ఎట్టకేలకు రోడ్డుపై చెత్త తొలగింపు

ABN , First Publish Date - 2023-03-26T00:18:24+05:30 IST

మండలంలోని సత్యవరం- పెదరాంభద్రపురం వెళ్లే రోడ్డులో తాండవ నది వంతెన వద్ద వేసిన చెత్తను ఎట్టకేలకు శనివారం తొలగించారు.

 ఎట్టకేలకు రోడ్డుపై చెత్త తొలగింపు
ఎక్స్‌కవేటర్‌తో చెత్తను తొలగిస్తున్న దృశ్యం

పాయకరావుపేట రూరల్‌, మార్చి25: మండలంలోని సత్యవరం- పెదరాంభద్రపురం వెళ్లే రోడ్డులో తాండవ నది వంతెన వద్ద వేసిన చెత్తను ఎట్టకేలకు శనివారం తొలగించారు. ఈ రోడ్డు మధ్యలో చెత్త వేయడంతో నెల రోజులుగా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా పెదరాంభద్రపురం ఎస్‌సీ కాలనీ వాసులు శ్మశాన వాటికకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. అధికారులకు, నాయకులకు ఎన్ని పర్యాయాలు ఫిర్యాదు చేసినా చెత్తను తొలగించలేదు. దీంతో గ్రామస్థులు డెక్కన్‌ కెమికల్స్‌ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించిన శనివారం ఎక్స్‌కవేటర్‌తో చెత్తను తొలగించారు.

Updated Date - 2023-03-26T00:18:24+05:30 IST