నలుగురు ‘మార్గదర్శి’ ఉద్యోగులపైౖ కేసు నమోదు?

ABN , First Publish Date - 2023-08-22T01:38:56+05:30 IST

నగరంలోని సీతంపేటలో గల మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురిపై ద్వారకా నగర్‌ పోలీసులు సోమవారం కేసు నమోదుచేశారు.

నలుగురు ‘మార్గదర్శి’ ఉద్యోగులపైౖ కేసు నమోదు?

సీతంపేట, ఆగస్టు 21:

నగరంలోని సీతంపేటలో గల మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురిపై ద్వారకా నగర్‌ పోలీసులు సోమవారం కేసు నమోదుచేశారు. అయితే ఈ విషయంపై పోలీసులు నోరు మెదపడం లేదు. విచారణ సాగుతుందని, ఇంకా కేసు కట్ట్టలేదని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం...సీతంపేట బ్రాంచీలో చిట్‌ కట్టిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంస్థ మేనేజర్‌ రామకృష్ణ, ఏజెంట్‌ రామకృష్ణ, ఉద్యోగి ప్రసాద్‌, మరో ఉద్యోగిపై కేసు నమోదుచేశారు. ఈ విషయమై సీఐ, ఎస్‌ఐ, సిబ్బంది ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు.

Updated Date - 2023-08-22T01:38:56+05:30 IST