ప్రజలను మభ్య పెట్టడానికే రాజధాని ప్రకటన

ABN , First Publish Date - 2023-02-02T01:26:08+05:30 IST

ప్రజలను మభ్య పెట్టడానికే జగన్‌రెడ్డి విశాఖ రాజధాని ప్రకటన చేశారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు.

ప్రజలను మభ్య పెట్టడానికే రాజధాని ప్రకటన

ఏకేపీ టౌన్‌ 7 : సమావేశంలో మాట్లాడుతున్న నాగజగదీశ్వరరావు

అనకాపల్లి టౌన్‌, ఫిబ్రవరి 1 : ప్రజలను మభ్య పెట్టడానికే జగన్‌రెడ్డి విశాఖ రాజధాని ప్రకటన చేశారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి ప్రజాదరణ తగ్గుతుందని ఇండియా టూ డే సీ ఓటర్‌ సర్వేలో తేటతెల్లం కావడం, వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్‌రెడ్డి మూలాలు బయటకు రావడంతో ప్రజలను మభ్యపెట్టడానికే విశాఖ పరిపాలన రాజధాని ప్రకటన చేశారని ఆయన ఆరోపించారు. గత సంవత్సరం దావోస్‌ పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏది అని పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు, కంపెనీ ప్రతినిధులు ప్రశ్నించారన్నారు. దానికి అనుగుణంగా మంగళవారంనాటి గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమిట్‌లో జగన్‌రెడ్డి విశాఖ పరిపాలనా రాజధాని అని, సీఎం క్యాంప్‌ కార్యాలయం తరలిస్తున్నామని ప్రకటించారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిం చేందుకు అంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకుడు వేగి వెంకటరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T01:26:09+05:30 IST