సందడిగా శామ్ నో వరుణ్ కారు యాత్ర
ABN , First Publish Date - 2023-03-31T01:14:40+05:30 IST
తీర ప్రాంతాలకు సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పించే లక్ష్యంతో చేపట్టిన శామ్ నో వరుణ్ కారు యాత్రను కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ గురువారం ప్రారంభించారు.
బీచ్ రోడ్డు, మార్చి 30: తీర ప్రాంతాలకు సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పించే లక్ష్యంతో చేపట్టిన శామ్ నో వరుణ్ కారు యాత్రను కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ గురువారం ప్రారంభించారు. భారతీయ యువతకు నారీ శక్తి ప్రదర్శన, అగ్నిపథ్ పథకంలో కెరీర్ గురించి తెలియజేయడమే దీని ఉద్దేశమన్నారు. ఈ మేరకు ఆర్కేబీచ్ కోస్టల్ బ్యాటరీ నుంచి తిరునెల్వేలి వరకు జరిగే యాత్రను జెండా ఊపి ప్రారంభించారు . సుమారుగా 35 మంది తూర్పు నౌవికాదళానికి చెందిన ఎన్డబ్ల్యూడబ్ల్యూఎ సభ్యులు, నేషనల్ వెటరన్స్ కలిసి ఆంధ్రప్రదేశ్, పుదుచ్ఛేరి, తమిళనాడు మీదుగా సుమారు 1,770 కిలోమీటర్లు యాత్రలో పాల్గొన్నారు. ఫ్లాగ్ ఆఫ్ అనంతరం స్వచ్ఛందంగా పాల్గొన్న వారందరికీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అభినందనలు తెలిపారు. ఈ ర్యాలీ కాకినాడ, భీమవరం మీదుగా మచిలీపట్నం చేరుకుని మొదటిరోజు యాత్ర ముగిస్తుంది. వచ్చే నెల 3న తిరునల్వేలి చేరుతుందన్నారు. ర్యాలీ అనంతరం ఆర్కేబీచ్లో బీచ్ క్లీన్ డ్రెవ్, గాజువాకలోని డిజైర్ సొసైటీ అనాఽధాశ్రమంలో ఔట్రీచ్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.