బీఎన్‌ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2023-03-31T01:21:10+05:30 IST

నర్సీపట్నం- భీమునిపట్నం(బీఎన్‌) రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని, ముందుగా వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా గోతులను యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేయాలని ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ ఆదేశించారు.

బీఎన్‌ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి
దొండ పూడి గ్రామ సమీపంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ

ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ ఆదేశం

రావికమతం, మార్చి 30: నర్సీపట్నం- భీమునిపట్నం(బీఎన్‌) రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని, ముందుగా వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా గోతులను యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేయాలని ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ ఆదేశించారు. రోలుగుంట మండలం వెలంకాయపాలెం నుంచి చోడవరం మండలం గంధవరం వరకు బీఎన్‌ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి, బిల్లు చెల్లింపులు లేక కొన్ని నెలలుగా ఆ కాంట్రాక్టరు పనులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా ధర్మశ్రీ చొరవతో ఆ కాంట్రాక్టరు గురువారం పనులు ప్రారంభించారు. దొండపూడి- టి.అర్జాపురం గ్రామాల మధ్య రోడ్డు మార్జిన్‌ విస్తరణ పనులు ప్రారంబించారు. ఇకపై నిరంతరాయంగా పనులు చేయాలని కాంట్రాక్టర్‌ను ధర్మశ్రీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దొండపూడి గ్రామ ఉప సర్పంచ్‌ గట్రెడ్డి రాజారావు, రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T01:21:10+05:30 IST