పేదలందరికీ మెరుగైన వైద్యం

ABN , First Publish Date - 2023-09-27T01:11:57+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేదలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి అన్నారు.

పేదలందరికీ మెరుగైన వైద్యం
మొక్క నాటుతున్న జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

తుమ్మపాల, సెప్టెంబరు 26 : రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేదలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి అన్నారు. మంగళవారం మామిడిపాలెం ఎంపీపీ స్కూల్‌లో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఎంపీపీ గొర్లి సూరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి సురక్ష కార్యక్రమంలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. రోగులకు పలు వైద్యపరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎ.హేమంత్‌, ఎంపీడీవో నరసింహారావు, సర్పంచ్‌ పూడి పరదేశినాయుడు, ఎంపీటీసీ సభ్యుడు బంధం అప్పలనాయుడు, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు బొండా అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-27T01:11:57+05:30 IST