అంగన్వాడీల భిక్షాటన
ABN , Publish Date - Dec 23 , 2023 | 12:51 AM
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. శుక్రవారానికి ఈ సమ్మె 11వ రోజుకు చేరుకుంది.
ప్రభుత్వ తీరుపై నిరసన
ముంచంగిపుట్టు, డిసెంబరు 22: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. శుక్రవారానికి ఈ సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలు స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లి భిక్షాటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా తమకీ దుస్థితి వచ్చిందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. సమ్మెకు గిరిజన సంఘం, సీఐటీయూ, సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమలో ఆయా సంఘాలు, పార్టీల నాయకులు కె.నర్సయ్య, ఎం.ఎం.శ్రీను, కె.శంకరావు, సర్పంచ్ కె.త్రినాథ్, బి.సత్యవతి, పి.రామదాసు, ఎస్.ఈశ్వరి, సుజాత, మౌలమ్మ, చిలకమ్మ, సూరమ్మ తదితరులు పాల్గొన్నారు.