విశాఖలో ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం
ABN , First Publish Date - 2023-08-19T02:55:55+05:30 IST
విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) క్యాంపు కార్యాలయాన్ని చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
విశాఖపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) క్యాంపు కార్యాలయాన్ని చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల వినియోగదారులకు అందుబాటులో ఉండేలా దీనిని ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా ఏపీ ట్రాన్స్కో, ఏపీ డిస్కమ్లు సమర్పించిన రిసోర్స్ అండ్ ఇన్వె్స్టమెంట్ ప్లాన్కు సంబంధించిన 5, 6 కంట్రోల్ పీరియడ్పై శనివారం విచారణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.