3,63,346 మందికి ‘ఆసరా’

ABN , First Publish Date - 2023-03-26T01:41:33+05:30 IST

జిల్లాలో 34,935 స్వయం సహాయక సంఘాలకు చెందిన 3 లక్షల 63 వేల 346 మంది సభ్యులకు వైఎస్సార్‌ ఆసరా పథకం కింద రూ.276.77 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు.

3,63,346 మందికి ‘ఆసరా’
లబ్ధిదారులకు నమూనా చెక్కు అందజేస్తున్న ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ, కలెక్టర్‌ రవిపట్టన్‌శెట్టి

అనకాపల్లి కలెక్టరేట్‌, మార్చి 25 : జిల్లాలో 34,935 స్వయం సహాయక సంఘాలకు చెందిన 3 లక్షల 63 వేల 346 మంది సభ్యులకు వైఎస్సార్‌ ఆసరా పథకం కింద రూ.276.77 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. సీఎం జగన్‌ ఏలూరు జిల్లా దెందులూరులో శనివారం లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా శంకరంలోని కలెక్టరేట్‌ సమావేశమందిరంలో కలెక్టర్‌ రవి పట్టన్‌తో కలిసి నమూనా చెక్కును లబ్ధిదారులకు ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T01:41:33+05:30 IST