AP News: చావుబతుకుల్లో ఉన్న టీచర్ మల్లేష్పై వైసీపీ దుష్ప్రచారం
ABN , First Publish Date - 2023-12-11T10:51:24+05:30 IST
Andhrapradesh: తన చావుకు జగనే కారణమంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన టీచర్ మల్లేష్ ప్రస్తుతం చావుబతులకు మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
అనంతపురం: తన చావుకు జగనే కారణమంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన టీచర్ మల్లేష్ ప్రస్తుతం చావుబతులకు మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ క్రమంలో టీచర్పై వైసీపీ దుష్ప్రచారానికి తెరలేపింది. లోన్ యాప్స్ నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ వైసీపీ సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోషల్ మీడియా ఇంచార్జ్ షాషు.. టీచర్ మల్లేష్కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. టీచర్ మల్లేష్ భార్య నర్సుగా పనిచేస్తున్నారని... లోన్ యాప్స్ నుంచి తీసుకున్న అప్పు చెల్లించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటూ వైసీపీ విషప్రచారం మొదలుపెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వ టీచర్ మల్లేష్కు ప్రభుత్వ సరోజన ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. పరిస్థితి సీరియస్గా వైద్యులు చెబుతున్నారు. అయితే వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై టీచర్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.