TarakaRatna : తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్.. కుటుంబ సభ్యులతో చర్చిస్తున్న వైద్యులు.. రేపు మధ్యాహ్నం తర్వాత...!!

ABN , First Publish Date - 2023-02-18T18:56:41+05:30 IST

టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) ఆరోగ్య పరిస్థితి (Health Condition)...

TarakaRatna : తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్.. కుటుంబ సభ్యులతో చర్చిస్తున్న వైద్యులు.. రేపు మధ్యాహ్నం తర్వాత...!!

బెంగళూరు : టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) ఆరోగ్య పరిస్థితి (Health Condition) అత్యంత విషమంగానే ఉంది. 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో (Narayana Hrudayalaya) తారకరత్న చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విదేశీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో తారకరత్నకు చికిత్స అందుతోంది. మరి కాసేపట్లో తారకరత్న హెల్త్‌ బులెటిన్‌ను (Health Bulletin) వైద్యులు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే మునుపటికి.. ఇప్పటికీ తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేదానిపై కుటుంబ సభ్యులతో నారాయణ వైద్యులు చర్చిస్తున్నారు. హెల్త్ బులెటిన్‌లో వైద్యులు ఏం చెబుతారో అనేదానిపై అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. రేపు అనగా ఆదివారం మధ్యాహ్నం తర్వాత తారకరత్నను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉందని నందమూరి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు కొందరు చెబుతున్నారు. ఇంకా తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం.. హైదరాబాద్ తరలించే అవకాశముందని వార్తలు విన్న అభిమానులు, టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన మరింత పెరిగిపోయింది.

తారకరత్నకు సంబంధించి మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..

ఫ్యామిలీ అంతా బెంగళూరులోనే..!

శనివారం మధ్యాహ్నం తారకరత్నకు బ్రెయిన్‌కు ఆస్పత్రి వైద్యులు మరోసారి బ్రెయిన్‌ స్కాన్‌ (Brain Scan) చేశారు. తారకరత్న(Actor)ను కోమా నుంచి బయటకు తీసుకువచ్చేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ (Nandamuri Balakrishna)తో పాటు నందమూరి కుటుంబసభ్యులు (Nandamuri Family) అంతా హుటాహుటిన బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. మరోవైపు టీడీపీ ముఖ్యనేతలు సైతం ఒక్కొక్కరుగా హృదయాలయకు చేరుకుంటున్నారు. 23 రోజులుగా తారకరత్న సతీమణి, పిల్లలు, తండ్రి ఆస్పత్రిలోనే ఉంటున్నారు. అటు కుటుంబ సభ్యులు, ఇటు టీడీపీ నేతలు ఆస్పత్రికి వస్తుండటంతో హృదయాలయ పరిసరప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

27న గుండెపోటు..

కాగా.. జనవరి 27న టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ‘‘యువగళం’’ పాదయాత్ర (YuvaGalam Padayatra)లో తారకరత్న పాల్గొన్నారు. ఈ క్రమంలో లోకేష్‌ (Naralokesh)తో పాటు పాదయాత్ర చేస్తుండగా తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను హుటాహుటిన కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఆపై మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి తారకరత్న కోలుకునేందుకు వైద్యులు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. విదేశీ వైద్యులను పిలిపించి మరీ తారకరత్నకు వైద్యం అందిస్తున్నారు. మరోవైపు తారకరత్న త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులు, ప్రజలు కోరుకుంటున్నారు.

Updated Date - 2023-02-18T19:07:11+05:30 IST