రేషన్‌ కార్డుదారులకు గోధుమ పిండి

ABN , First Publish Date - 2023-02-01T23:55:44+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులతో పాటు పైలట్‌ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన రెండు కిలోల గోధుమపిండి పంపిణీని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ రేషన్‌ కార్డుదారులకు అందజేసి ప్రారంభించారు.

రేషన్‌ కార్డుదారులకు గోధుమ పిండి

అరసవల్లి: రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులతో పాటు పైలట్‌ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన రెండు కిలోల గోధుమపిండి పంపిణీని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ రేషన్‌ కార్డుదారులకు అందజేసి ప్రారంభించారు. స్థానిక ఏడురోడ్ల జంక్షన్‌ సమీపం లో గల దుర్గమ్మ ఆలయం వెనుక, ఎండీఎం వాహనం ద్వారా సరఫరా జరుగుతు న్న తీరును పరిశీలించారు. డీఎస్‌వో రమణ, తహసీల్దార్‌ కె.వెంకటరావు, సీఎస్‌డీటీ షరీఫ్‌, రెవెన్యూ సిబ్బంది, ఎండీయూ అపరేటర్లు మాధవ్‌, రాజా, డీలర్లు గంగాధర్‌, అభిషేక్‌, తరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:55:45+05:30 IST