ఎన్నికల శంఖారావానికి తరలిరావాలి
ABN , Publish Date - Dec 14 , 2023 | 11:45 PM
యువగళం ముగింపు సభ పురస్కరించుకుని జరగనున్న ఎన్నికల శంఖారావం కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కలమట వెంకటరమణ పిలుపునిచ్చారు.
- మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ
పాతపట్నం: యువగళం ముగింపు సభ పురస్కరించుకుని జరగనున్న ఎన్నికల శంఖారావం కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కలమట వెంకటరమణ పిలుపునిచ్చారు. గురువారం పాతపట్నంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ జాతీ యప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు విజయవంతం చేసేందుకు సిద్ధం కావాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో విజయానికి సమష్టిగా కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జీలు, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు.