ఉర్లాం రైల్వే గేట్ వద్ద గుర్తుతెలియని మృతదేహం
ABN , First Publish Date - 2023-06-03T00:24:17+05:30 IST
ఉర్లాం అండర్ పాసైజ్ గేట్ వద్ద 65 ఏళ్లు వృద్ధుని మృతదేహం ఉందని శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వే పోలీసులు తెలిపారు.
నరసన్నపేట/ ఆమదాలవలస: ఉర్లాం అండర్ పాసైజ్ గేట్ వద్ద 65 ఏళ్లు వృద్ధుని మృతదేహం ఉందని శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వే పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం రోడ్ నుంచి ఉర్లాం వైపు వెళ్లే ట్రాక్పై రైలు కింద పడి మృతి చెందాడని, శరీర భాగాలు వేర్వేరుగా పడి ఉన్నాయన్నారు. గ్యాంగ్మెన్ గుర్తించి సమాచారం ఇచ్చారన్నారు. మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించా మన్నారు. మృతుడు సిమెంట్ కలర్ గల గడుల షర్టు, లేత కాషాయం రంగు పంచే ధరించి, తెలుపు గడులు గల టవల్ ఉన్నట్టు తెలిపారు. మృతిడి వివరాలు తెలిసినవారు జీఆర్పీ స్టేషన్లో సంప్రదించాలన్నారు. పలాస జీఆర్పీ ఎస్ఐ ఎస్కే షరీఫ్ కేసు నమోదు చేసినట్టు ఆర్పీఎఫ్ హెచ్సీ అప్పన్న తెలిపారు.