రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2023-02-19T00:13:16+05:30 IST

తమ్మినాయుడుపేట పంచాయతీ సనపలవానిపేట సమీపంలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు.

 రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ఎచ్చెర్ల, ఫిబ్రవరి 18: తమ్మినాయుడుపేట పంచాయతీ సనపలవానిపేట సమీపంలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. పలాస మండలం రాజగోపాలపురానికి చెందిన అన్నెపు రాకేష్‌, తల్లి బృందావతి విశాఖపట్నం నుంచి ఓ వ్యాన్‌లో ఇంటికి అవసరమయ్యే కలపను తీసుకెళ్తుండగా సనపలవానిపేట సమీపంలో వ్యాన్‌ డ్రైవర్‌ శాంతారావు అకస్మాత్తుగా బ్రేక్‌ వేశాడు. దీంతో వ్యాన్‌ అదుపుతప్పి డివైడర్‌ను దాటి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌ క్యాబిన్‌లో కూర్చొన్న రాకేష్‌, బృందావతి గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-02-19T00:13:18+05:30 IST