నాటుబండితో తొక్కించి..
ABN , First Publish Date - 2023-06-03T00:33:46+05:30 IST
ఇసుకను తరలి స్తున్న వ్యక్తిని ప్రశ్నించినందుకు ఏకంగా నాటుబండితో తొక్కించి హత్యచేసిన ఉదంతం శ్రీకాకుళం మండలంలో చోటుచేసుకుంది.
- ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన వ్యక్తిని హతమార్చిన వైనం
శ్రీకాకుళం, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ఇసుకను తరలి స్తున్న వ్యక్తిని ప్రశ్నించినందుకు ఏకంగా నాటుబండితో తొక్కించి హత్యచేసిన ఉదంతం శ్రీకాకుళం మండలంలో చోటుచేసుకుంది. శ్రీకాకుళం రూరల్ స్టేషన్ ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గురువారం అర్ధ రాత్రి నాగావళి నది నుంచి ఇసుకను నాటుబళ్లతో తరలి స్తున్నవారిని ఖాజీపేట గ్రామానికి చెందిన సదాశివుని రాజేష్ (38) వాటర్ప్లాంట్కు సమీపంలో అడ్డుకున్నాడు. గ్రామానికి ఉన్న కట్టుబాట్లను మీరి ఇసుకను తరలించడమేంటని రాజేష్తో పాటుగా మరికొందరు ఇసుకను తరలిస్తున్న వ్యక్తితో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో ఘర్షణ వాతావ రణం నెలకొంది. నాటుబండిపై ఉన్న బలరాం హిమల్.. ఏకంగా రాజేష్పై నుంచి నాటుబండిని తొక్కించుకుని వెళ్లాడు. దీంతో రాజేష్కు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విష మించి రాజేష్ మృతిచెందాడు. రాజేష్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. బలరాం హిమల్ను అరెస్టు చేశామని ఎస్ఐ విజయకుమార్ తెలిపారు.