‘ఆ భూములు గిరిజనులకే దక్కాలి’

ABN , First Publish Date - 2023-03-25T23:40:48+05:30 IST

మెళియాపుట్టి: పరశరాంపురం పరిధిలో ఉన్న భూములు గిరిజనులుకు దక్కల ని సీపీఎం నాయకులు గోవిందరావు డిమాండ్‌ చేశారు.

 ‘ఆ భూములు గిరిజనులకే దక్కాలి’

మెళియాపుట్టి: పరశరాంపురం పరిధిలో ఉన్న భూములు గిరిజనులుకు దక్కల ని సీపీఎం నాయకులు గోవిందరావు డిమాండ్‌ చేశారు. శనివారం గ్రామ పరిధిలో ఉన్న భూములను పరిశీలించారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములను కొంత మంది తప్పుడు పత్రాలు సృష్టించి భూములపైకి వస్తున్నారని తెలిపారు. గిరిజను లకు ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్‌ చేశారు. దీన్నిపై వచ్చే 3న రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేయనున్నట్టు తెలిపారు. సీపీఎం నాయకులు మోహనరావు, సూరయ్య, రామకృష్ట, బాలరాజు, విమలరావు, తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-03-25T23:40:48+05:30 IST