పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

ABN , First Publish Date - 2023-06-03T00:09:16+05:30 IST

రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయా లని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ మూర్తి అన్నారు. యంబరాం గ్రామంలో శుక్రవారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

 పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

మాజీ ఎమ్మెల్యే వెంకటరమణమూర్తి

యంబరాం(ఎల్‌.ఎన్‌.పేట): రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయా లని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ మూర్తి అన్నారు. యంబరాం గ్రామంలో శుక్రవారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఎన్నికల్లో టీడీపీ అధిష్ఠానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ప్రక టించినా అతనిని గెలిపించే దిశలో పార్టీ క్యాడర్‌ అంకితభావంతో పనిచేయా లన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎం. మనోహర్‌నాయుడు, ఎంపీటీసీ ఎం.లక్ష్మీ ప్రియదర్శిని, ఎం.చిట్టిబాబు, జె.మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

‘ఉపాధి’ పనిదినాలు తక్కువ నమోదు అన్యాయం

హిరమండలం: ఉపాధి వేతనదారులు చేసిన పని దినాలు కంటే తక్కువగా నమోదు చేయడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. నియోజక వర్గంలో చాలా చోట్ల ఉపాధి పనులను సిబ్బంది తక్కువగా నమోదు చేస్తున్నారన్నారు. దీంతో వేతన దారులు నష్టపోతార న్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సురేష్‌, ఎస్‌.గోవిందరావు, పీవీ రమణ, బి.సత్యనారాయణ, టి.లక్ష్మణణరావు ఉన్నారు.

Updated Date - 2023-06-03T00:09:16+05:30 IST