క్రికెట్ సందడి
ABN , First Publish Date - 2023-11-19T23:57:08+05:30 IST
వరల్డ్కప్ పోరులో భాగంగా జిల్లాఅంతటా ఆదివారం క్రికెట్ సందడి నెల కొంది. శ్రీకాకుళం ఏడురోడ్ల జంక్షన్లోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో భారీ డిజిటల్ స్ర్కీన్ను జిల్లా క్రికెట్ అసోసి యేషన్ ఏర్పాటు చేసింది.

- ఎన్టీఆర్ ఎంహెచ్ గ్రౌండ్లో భారీ స్ర్కీన్ ఏర్పాటు
- ప్రపంచకప్ ఫైనల్ను వీక్షించిన వేలాది మంది ప్రేక్షకులు
శ్రీకాకుళం స్పోర్ట్స్, నవంబరు 19: వరల్డ్కప్ పోరులో భాగంగా జిల్లాఅంతటా ఆదివారం క్రికెట్ సందడి నెల కొంది. శ్రీకాకుళం ఏడురోడ్ల జంక్షన్లోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో భారీ డిజిటల్ స్ర్కీన్ను జిల్లా క్రికెట్ అసోసి యేషన్ ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మైదానంలో ప్రేక్షకుల రద్దీ కనిపించింది. ఉత్కంఠభరితంగా క్రికెట్ మ్యాచ్ సాగడంతో కేరింతలు, నిశబ్దం నడుమ తుదిపోరును వీక్షించారు. అలాగే జిల్లాకేంద్రంలోని గొంటివీధి, రెల్లి వీధిలతో సహా పలు వీధుల్లో స్ర్కీన్లు ఏర్పాటు చే శారు. కొందరు స్పాన్సర్లు మొబైల్ వ్యాన్లలో డిజిటల్ స్ర్కీ న్లు ఏర్పాటు చేశారు. ఆమదాలవలస రైల్వేస్టేషన్ ఆవర ణతోపాటు సరుబుజ్జిలి, కోటబొమ్మాళి, పాతపట్నం.. ఇలా ఎక్కడికక్కడ స్ర్కీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్ను వీక్షించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ టీవీల్లో వరల్డ్ కఫ్ ఫైనల్ మ్యాచ్ వీక్షించడంతో రోడ్లు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు బోసిపోయాయి. కాగా, తుదిపోరులో టీమిం డియా ఓటమితో క్రీడాభిమానులు నిరాశ చెందారు.